Vijayawada: నేడు మూలానక్షత్రం.. ఇంద్రకీలాద్రికి పవన్‌, చంద్రబాబు

-

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేడు మూలానక్షత్రం సందర్భంగా భక్తులు..పోటెత్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచీ 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మ కు సారె సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.

Darshan of Lalita Tripurasundari as Goddess Kanakadurgamma today on the 4th day of Dasara Sharannavaratra

సీఎంతో పాటు సీఎం సెక్యూరిటీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఉంటుంది. ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ దర్శనం‌ చేసుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎం ల రాక కారణంగా సామాన్య భక్తుడి దర్శనం నిలుపుదల ఉండదని దేవాదాయ శాఖామంత్రి పేర్కొన్నారు. అటు ఇవాళ సాయంత్రం 4 గంటల తరువాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version