నెల్లూరు హనుమాన్ శోభా యాత్రలో ముస్లింలు, టెర్రరిస్టులు !

-

నెల్లూరు జిల్లా : బి.జె.పి. ఎం.ఎల్.సివాకాటి నారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు లో హనుమాన్ శోభా యాత్ర లో ఖాళీ బీర్ బాటిల్ వేయడం సరికాదని.. కోర్టు వద్ద ఉన్న మసీదులో కత్తులు..రాళ్లు పెట్టుకున్నారన్నారు. పవిత్రమైన స్థలమని చెప్పి కత్తులు..రాళ్లు పెట్టడం ఎంతవరకూ సమంజసమని.. కొంతమంది ముస్లింలు..టెర్రరిస్టులు కలిసి ఈ దాడి చేశారని ఆరోపించారు.

వేలాది మంది పాల్గొన్న ఈ శోభా యాత్ర విజయవంతమైందని.. ముందుగానే రోడ్ మ్యాప్ పోలీసులకు ఇచ్చామన్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతోంది.. ఈ యాత్ర పై దాడి చేయడం సరికాదని తెలిపారు. భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు.. హిందువులకు రక్షణ లేకుండా పోతోందని ఫైర్ అయ్యారు.

పోలీసులు సమయ స్పూర్తితో వ్యవహరించడంతో ఘర్షణ తప్పింది.. రొట్టెల పండుగకు వచ్చే వారిని ఎవరైనా ఏమైనా అన్నారా..? అని నిలదీశారు. కోర్టు దగ్గర జలవనరుల శాఖ స్థలంలో అక్రమంగా మసీదు నిర్మించారు… ఈ విషయంలో కోర్టులో కూడా కేసు ఉందని తెలిపారు. రెచ్చగొట్టేలా వ్యవహరించారు. గతంలో జిల్లా ఎస్.పి.మీదదాడి చేస్తే ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news