అమ్మలాంటి అమరావతి పై జగన్ కుట్రలకు అంతే లేదు: నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ లాంటి అమరావతి పై జగన్ కుట్రలకు అంతే లేదని మరోసారి నారా లోకేష్ విమర్శించారు. అమరావతి రాజధాని కి భూకంపం ప్రమాదం ఉందని, ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అధికారంలోకి వచ్చాక నానా విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎకరం పది కోట్లకు ఎలా అమ్ముతారు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు.

అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ ఎకరా రూ. 10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసిపి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఇప్పటికే అక్కడ భూముల్ని రాజధాని కోసం ఇచ్చిన రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అమరావతి లో భూములు ఇలా విడిగా అమ్ముకుంటూ పోతే రాజధాని పరిస్థితి ఏంటని మిగిలిన తమ భూముల విలువ పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పు అమలు చేసే ప్రక్రియలో భాగంగానే తామ భూముల్ని అమ్ముతున్నట్లు సమర్థించుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news