ప్రస్తుత రాజకీయ నాయకుల పై ఎలాంటి సెటైర్లు వేయలేదు – చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ” గాడ్ ఫాదర్”. దసరా రోజున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గాడ్‌ ఫాదర్‌ ప్రెస్‌ మీట్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదని అన్నారు. తాను పాలిటిక్స్ నుండి ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉండాలని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. ఒకవేళ భవిష్యత్తులో సపోర్టు ఇవ్వచ్చేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ నిబద్ధత గురించి తనకి చిన్నప్పటి నుంచి తెలుసని అన్నారు చిరంజీవి. తన స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను అన్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్‌ హాట్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news