కార్మికుల తరఫున పోరాడేది ఎర్రజెండా మాత్రమే – సీపీఐ రామకృష్ణ

-

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుడు మాత్రమే సంస్ధను తనదిగా భావిస్తాడని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తాం అంటున్నాడని.. ప్రధాని మోదీ తాత, తండ్రి సంపాదించింది ఏమైనా ఉందా..? ప్రభుత్వరంగ పరిశ్రమలలో అని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయని దరిద్రుడు మోదీ విమర్శించారు రామకృష్ణ.

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నారని.. విశాఖ ఉక్కును కేవలం కలం పోటుతో ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేకుండా పోయిందన్నారు. 35.1% ఏపీలో నిరుద్యోగులున్నారని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలో సమస్యలకే కాకుండా రైతుల సమస్యల కోసం ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల తరఫున పోరాడే జెండా.. ఎర్రజెండా మాత్రమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news