దుర్మార్గుడైన చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు – మంత్రి కొట్టు

-

భీమవరం: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావుడి పడిపోతున్నాయని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయనుడని అన్నారు. ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయన్నారు. భగవంతుడు 2014 నుండి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం, ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారని తెలిపారు.

అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి అసత్యాలు పలుకుతూ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవన్నారు మంత్రి కొట్టు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబును ఆశ్రయించిన అతని విధానాన్ని తప్పుపడుతున్నామన్నారు. ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసేలాగా మాట్లాడే ప్రతి మాటని ఖండిస్తున్నామన్నారు. నువ్వు స్థాపించిన పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యమని పవన్ కళ్యాణ్ కి సూచించారు. వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే పవన్ కళ్యాణ్ ధర్మం పక్షం వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news