రేపే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

పవన్ కళ్యాణ్ నామినేషన్ కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు ర్యాలీకి సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారిగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. తమను అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version