కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు క్షమించరు – మంత్రి కారుమూరి

-

రాష్ట్రంలో యాదవులకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో యాదవుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. టిడిపి ఏ రోజు యాదవులకు సముచిత స్థానం ఇచ్చింది లేదన్నారు. 25 లక్షల మంది యాదవులు రాష్ట్రంలో ఉన్నారని గుర్తించింది.. యాదవులు ఇద్దరినీ రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు.

చదువులో 17వ స్థానంలో ఉండే వాళ్ళమని.. ఈరోజు రెండవ స్థానంలో ఉన్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బీసీలు ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పుంగనూరులో గుండాలను తీసుకువచ్చి చంద్రబాబు విధ్వంసం చేసిన ఘటనను రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. ఇలాంటి కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు క్షమించరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version