పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు(శనివారం) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.కాగా ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in లో అందుబాటులో ఉంచనున్నాయి. ఈసారి గ్రేడుల కు బదులు మార్కులను ప్రకటించనున్నారు.

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్టవేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతర ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news