ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే..!

-

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీలో ఆ పార్టీదే అధికారం అంటూ సర్వే సంస్థలు మైకులు వేసుకొని ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరు ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ ఎగ్జిట్ పోల్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కొందరు మీరు చెప్పింది నిజమే అన్న అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకు ఆర్జీవీ చేసిన ట్వీట్ లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అని అనుకుంటున్నారా?. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. అలాగే టీడీపీ కూటమి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ట్వీట్ ను షేర్ చేశారు. అయితే రాము మంచి బాలుడు ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేందుకు రెండు పార్టీలకు సరిసమాన సీట్లను ఇచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news