టాలీవుడ్‌ హీరోలు తలుచుకుంటే..వైసీపీ మాటాషే – వైసీపీ ఎంపీ

-

 

సినీ హీరోలు ఆగ్రహించి మన పార్టీకి వ్యతిరేకంగా ఒక్క పిలుపునిస్తే చాలు వారి అభిమానులు, గాలిలో దీపంలా రెపరెపలాడుతున్న మన పార్టీ తొక్కుకుంటూ వెళ్తారని… అప్పుడు మన పార్టీ మటాషవడం ఖాయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు రెండు మంచి మాటలు చెబితే తట్టుకోలేక ఆయన్ని విమర్శించడం ద్వారా మన నెత్తిన మనమే బస్మాసుర హస్తం పెట్టుకున్నట్లయిందన్నారు.

సినీ హీరోల అభిమానులంతా కలిసి తమ సినిమా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక కులమంతా ఏకమైనట్టుగా సినీ అభిమానులు కూడా ఏకమైతే, మన పార్టీకి ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు. ఏడు, ఎనిమిది మంది అగ్ర హీరోలకు పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు ఉన్నారని, సినిమా పరిశ్రమపై తమ పార్టీ నాయకులు, కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని, ఆ హీరోలు తమ అభిమానులకు పిలుపునిస్తే పార్టీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సినీ అభిమానులకు, కులానికి సంబంధం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version