ఉద్యోగుల నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు : సజ్జల సంచలనం

-

ఉద్యోగుల నిరసనలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉందని సజ్జల అన్నారు. ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. కోరారు. సీపీఎస్ రద్దు, అవుట్ సోర్సింగ్ ఒక పట్టాన తెగేవి కావన్నారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు పడ్డాయన్నారు.

రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదని.. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని పేర్కొన్నారు. పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని అడిగామని.. డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు. నిన్న సాయంత్రం, ఇవాళ ఉదయం కూడా ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారని.. ఉద్యోగ సంఘాలు అసలు సమస్యల పై మాట్లాడేందుకు రావాలని కోరామని చెప్పారు. కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరామని.. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news