ఏపీ క్యాబినెట్ లో అతిపిన్న వయస్కురాలిగా మహిళా నేత

-

చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా తెలుగుదేశం ఫైర్ బ్రాండ్.. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (40) నిలిచారు. చంద్రబాబు నాయుడు అనితకు కేబినెట్ లో చోటు కల్పించారు. ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు. 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు. అంతేకాకుండా 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

ఇక వంగలపూడి అనిత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వంగలపూడి అనిత తాజాగా ఈ ఏడాది ఎన్నికల్లో అదే పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సీటు సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news