కుటుంబ పార్టీలను తరిమికొట్టేందుకు రాజ్యాంగం తెస్తాం : కెసిఆర్ కు సోము వీర్రాజు కౌంటర్

-

ప.గో జిల్లా.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు అని.. కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యంగం మారిపొద్దని చురకలు అంటించారు.

ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ పార్టీ లను భారతదేశం లో ఉంచబోమని.. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నామని ప్రకటన చేశారు.

రెండు యూనిట్ ల ఇసుక లారీ మేం ఐదువేలకే ఇస్తామని.. చీమకుర్తి గ్రానైట్ ను ప్రజాపరం చేస్తామని పేర్కొన్నారు. మోడీ ఇజం ఆంధ్రరాష్ట్రానికి అవసరమని.. కాకినాడ కెమికల్ మెట్రో కాంప్లెక్స్ ఎప్పుడో ఇచ్చాం. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టలేదన్నారు. ఇది పూర్తయితే డైరెక్టుగా రెండులక్షల, ఇండైరెక్టుగా నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news