కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు : హోంమంత్రి అనిత

-

కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ తల్లిని దర్శించుకొని.. దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజువారి వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే వారిని సహించబోమన్నారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్త ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్ గా జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version