BREAKING : అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

-

తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది పలుగురు నాయకులు అనారోగ్యం మారిన పడి మృతిచెందగా… తాజాగా ఆ పార్టీలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మూలారెఢ్డి… కాసేపటికి క్రితమే మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రిలోనే మూలారెడ్డి మరణించినట్లు సమాచారం. టిడిపి తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మూలారెడ్డి… తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు.

1983, 1985,1994,1999 ఎన్నికలలో ఎమ్మెల్యే గా మూలారెడ్డి గెలిచారు. ఇక టిడిపి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి మృతి పట్ల నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అటు నారా లోకేష్ సైతం తన ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news