టీచర్‌పై టీడీపీ నేత బూతులు…లోఫర్ నా కొడుకా అంటూ !

-

TDP Leader Comments On Teacher in Nandyal District: నంద్యాల జిల్లా కోర్నపల్లెలో ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతులతో రెచ్చిపోయారు. గవర్నమెంట్ స్కూల్‌లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని.. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని టీచర్ తెలిపారు. దీనిపై టీడీపీ నేత, డీలర్ విజయ భాస్కర్ స్పందిస్తూ.. ‘ఎవడు ఎంఈవో, లోఫర్ నా కొడుకా.. మాకు 164 సీట్లు వచ్చాయి.

TDP Leader Comments On Teacher in Nandyal District

మర్యాద నేర్చుకో నువ్వు. స్టోర్ బియ్యం బడిలో దించుతాం. ఇక్కడ ఉండకపోతే వెళ్లిపో.’ అంటూ హెచ్చరించారు.

ఇక మొన్న పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసుగా ప్రవర్తించడంతో.. మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు చంద్రబాబు. అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా మసలుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టంచేశారట చంద్రబాబు. ఆ ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేస్తూ.. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version