జగన్ నొక్కే బటన్ కి కరెంట్ లేదు – నారా లోకేష్

-

సీఎం వైఎస్ జగన్ నోక్కే బటన్ కి కరెంట్ లేదని ఎద్దేవా చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కరెంటు లేని బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల జేబులకు చిల్లు ఎలా పొడవాలని చూసే పెత్తందారు సైకో జగన్ అని విమర్శించారు.

వైసిపి పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రమంతా చీకట్లు అలుముకుంటున్నాయన్నారు. కరెంటు కోతలతో రైతంగంతో పాటు ఇండస్ట్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో కులం, మతం చూడనని చెప్పిన జగన్.. ఇప్పుడు కులం, మతం, పార్టీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version