తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు టికెట్ల విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇవాళ తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి.. 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు టీటీడీ అధికారులు. అలాగే కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను 21న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. వర్చువల్‌ సేవా టికెట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది టీటీడీ పాలక మండలి.

NOTE : ఇక ఈ టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in/home/dashboard వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని కోరింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version