శ్రీవారి భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి వస్త్రాల ఈ-వేలం

-

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి ఈ-వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బంగారు వాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు, దోతీలు, ఉత్తరియాలు, వివిధ రకాల చీరలు, శాలువాలు, టర్కీ టవర్లు, దుప్పట్లు, కర్టన్లు తదితరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు 0877-2264429 నంబర్లేదా టీటీడీ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. కాాగా…. నేడు ఏప్రిల్ కోటా ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మాసం కు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు సమయంలో తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు భక్తులు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచనలు చేసింది టీటీడీ పాలకమండలి. ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధర 300 రూపాయలు ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే శ్రీవారి దర్శనం అవలీలగా జరుగుతుందని పేర్కొంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news