వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తాం – వెల్లంపల్లి

-

ప్లీనరీ సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుదే విజయమని… వంగవీటి రాధా వచ్చిన ఎవరు వచ్చినా.. వైసీపీదే విజయమన్నారు. టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్‌ ఊడిగం చేస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైకాపానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయని… ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించటానికి గడప గడపకి వెళ్తున్నామన్నారు. టిడిపి కి, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసిన వారి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరిస్తున్నామని.. గ్లాసు కు ఓటు వేసిన నాకు కాపు నేస్తం వచ్చింది అని చెప్తున్నారన్నారు.

సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని.. జగన్ ను సింగిల్ గా ఎదుర్కునే సత్త చంద్రబాబు కు లేదని విమర్శించారు. అయ్యన్న పాత్రునికి నోరు విప్పితే బూతులేనని.. ఎన్ని జన్మలెత్తిన చంద్రబాబు సీఎం కాలేడని చురకలు అంటించారు. చంద్రబాబుకు జై కొట్టే వాళ్ళు ఇద్దరే… లోకేష్, అతని దత్త పుత్రుడు పవన్ అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news