అమిత్ షాతో జగన్.. ఫోటో షేర్ చేసిన విజయ సాయి

-

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. టీడీపీ పార్టీనే టార్గెట్‌ చేసి.. వారిపై విరుచుకుపడుతారు. అయితే.. తాజాగా అమిత్ షాతో జగన్.. ఉన్న ఫోటో షేర్ చేశారు విజయ సాయిరెడ్డి. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్‌ షా పుట్టిన రోజు.

ఈ నేపథ్యంలోనే.. అమిత్‌ షాకు బర్త్‌ డే విషేస్‌ చెప్పారు విజయసాయిరెడ్డి. గౌరవనీయులైన భారత హోం మంత్రి అమిత్ షాజీ ఆయురారోగ్యాలతో ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేంకటేశ్వరుడు ఆశీర్వదిస్తాడు అంటూ ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి.

ఇక మరో ట్వీట్‌ లో విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమరవీరులకు నివాళులు. పౌరుల భద్రత కోసం తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులకు వందనం. రేయింబవళ్ళు విధిలో ఉంటూ ప్రజలకు భద్రత కల్పిస్తున్న సమాజ రక్షకులకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నా సెల్యూట్స్ అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news