మరో 20 ఏళ్లు జగన్ అధికారంలో ఉండేలా పని చేస్తా – విజయసాయి

-

మరో 20 ఏళ్లు జగన్ అధికారంలో ఉండేలా పని చేస్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెల్లడించారు. నిన్న సీఎం జగన్‌ తన రాజ్యసభ సభ్యులు ఫైనల్‌ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పేర్లు ఫైనల్ చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే.. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై విజయ సాయిరెడ్డి ప్రత్యేక కృతజ్ఙతలు చెప్పారు.

” రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ గారికి, శ్రీమతి భారతమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. పార్టీ కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేస్తా. జగన్ గారి పాలనలో మరో 20 ఏళ్లు రాష్ట్రం సుభిక్షంగా పరిఢవిల్లేలా కృషి చేస్తా.”అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని.. ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news