విజయవాడ దుర్గమ్మకు రూ. 100 కోట్లు ..!

-

దుర్గమ్మకు రూ. 100 కోట్లు ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వం వద్ద డిమాండ్‌ పెట్టారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈ రోజు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కలిశారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇంద్ర కీలాద్రి అభివృద్ధి కోసం ప్రసాద్ పథకం కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు ఎంపీ కేశినేని శివనాథ్.

Protocol darshans canceled in Vijayawada

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ఎంపీ కేశినేని శివ నాథ్. ఎంపీ కేశినేని శివ నాథ్ అభ్యర్థులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్.. దీనిపై చర్చిస్తామన్నారు. ఇంద్ర కీలాద్రి అభివృద్ధి కోసం ప్రసాద్ పథకం కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version