నవరత్నాలు కాదు.. ఇవి జగన్ నవమోసాలు : యనమల

-

అమరావతి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు కాదు.. ఇవి జగన్ నవమోసాలని యనమల విమర్శించారు. మళ్లీ జగన్ గెలిస్తే..ఇంతే సంగతులు అంటూ ఆగ్రహించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవరత్నాలని డబ్బా కొడుతున్నాడు.. అవి జగన్ నవమోసాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు జగన్ విచ్చలవిడి వాగ్దానాలు చేశాడని మండిపడ్డారు.

అధికారంలోకి రాగానే నయవంచన చేశాడని… జగన్ 3ఏళ్ల పాలన 9మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా సాగడం ప్రజల కళ్లముందే ఉందని నిప్పులు చెరిగారు. ఇప్పుడు మళ్లీ నవరత్నాల గురించి మాట్లాడటం, తాను గెలవకపోతే వాటిని నిలిపేస్తారని చెప్పడాన్ని ప్రజలే ఈసడిస్తున్నారని… నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన జగనుకు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. రూ. 5 కోట్ల ప్రజల సంక్షేమాన్నే కాదు, భావితరాల భవిష్యత్ నే జగన్ చావుదెబ్బ తీశాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news