BREAKING : వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్ !

-

BREAKING : వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు పిక్స్ అయ్యారు. ఇవాళ ఉగాది పర్వదినం. ఈ తరుణంలోనే… వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పిక్స్ చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు కాసేపటి క్రితమే.. వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వైసీపీ.

పోతుల సునీత, మర్రి రాజశేఖర్, పెనుమత్స వివి సూర్య నారాయణ రాజు, కోలా గురువులు, బొమ్మ ఇజ్రాయెల్, చంద్రగిరి ఏసు రత్నం, జయ మంగళ వెంకటరమణ వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఉన్నారు. కాగా.. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీ ఈ ఏడు స్థానాలని ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు చూస్తుంది. పూర్తి బలం ఉండటంతో గెలిచేస్తామనే ధీమాతో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news