ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. నేడు అకౌంట్లో రూ.లక్ష జమ

-

ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ కల్యాణ మస్తు, షాదీతోపా మూడో విడత నిధులు నేడు విడుదల చేయనుంది జగన్ సర్కార్. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు ఈ ఆర్థిక సాయం చేయనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దీంతో 18, 883 మంది జంటలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాల కింద 141.6 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కార్యక్రమం జరునుంది. ఈ నేపథ్యంలో లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version