విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో మరో 119 బీసీ జూనియర్ కాలేజీలు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరిన్ని గురుకుల జూనియర్ కాలేజీలో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం మరో 119 బీసీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా 119 గురుకుల పాఠశాలలను అప్ గ్రేడ్ చేయనుంది. దీంతో ఈ పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తారు.

2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కాలేజీలో ఏర్పాటుకు మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం 21 గురుకుల విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున రెండు విడతల్లో 238 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news