దావోస్‌లో బీజీబీజీగా సీఎం జగన్‌ పర్యటన..

-

ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ దావోస్‌ బీజీబీజీగా పర్యటిస్తున్నారు. ఏపీకి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన సీఎం జగన్ తొలిరోజు బిజీగా గడిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్… వరుసగా అనేకమంది వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు.

andhra pradesh chief minister jagan mohan reddy tour in davos world  economic forum | CM Jagan Tour: ఆంధ్రలో పెట్టుబడులు  పెట్టండి..పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ ఆహ్వానం ...

బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ బక్నర్ తో భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం జగన్ ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news