ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు.. నాలుగు మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓరోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నిన్నటి కంటే ఇవాళ కరోనా మహమ్మారి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా ఏకంగా 154 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ కరోనా కారణంగా గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మరణించారు.

carona ap

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73, 730 కి పెరిగింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 452 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2122 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 177 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 57 , 156 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version