ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 100 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2317605 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 725 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3518 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,329 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2299362 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 15,213 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,30,81,987 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news