Breaking : మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌..

-

ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సముద్రం లో చేపల వేట నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, దీంతో చాలా మంది మత్స్యకారులు తమ జీవనోపాధి కోల్పోయారు. కానీ ఇలా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెలియచేసింది. మత్స్యకార భరోసా పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. మత్స్య శాఖ కమిషనర్ సూచనల మేరకు మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్. నిర్మలా కుమారి సమీక్షించారు.

A year after Konaseema caste riots, why Andhra govt wants to withdraw all  cases

సముద్ర తీర మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం మండలాలలోని అన్ని లాండింగ్ సెంటర్లలోనూ మత్స్య శాఖ సిబ్బంది, గ్రామ మత్స్య సహాయకులు, సాగర మిత్రలతో సర్వేను నిర్వహించడం జరిగింది. దీని అనంతరం డేటా ఎంట్రీ చేసి అర్హత మేరకు అర్హులైన మత్స్యకారులందరికి మే రెండో వారంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా చెల్లించబడునని తెలియచేశారు. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కుమారి యు.చాందిని, మెరైన్ సీఐ వి.శ్రీనివాస రావు, టి.రమేష్ ఎస్.ఐ.లు జిల్లాలో గల అన్ని ఫిష్ లాండింగ్ సెంటర్ల యందు ప్రశాంతంగా ఎన్యుమరేషన్ జరిగేటట్లు పర్యవేక్షణ చేపట్టారు .

 

 

Read more RELATED
Recommended to you

Latest news