ఇవాళ కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతున్న తరుణంలో… కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే… మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! అని ఫైర్ అయ్యారు.

బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు… తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదన్నారు కేటీఆర్. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం అన్నారు. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం… తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని తెలిపారు కేటీఆర్.