BREAKING: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్

-

వరసగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, స్టోర్ట్స్ పర్సన్లకు కోవిడ్ పాజిటివ్ వస్తోంది. ఇప్పటికే పలువరు ఎంపీలకు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇలా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతుండటంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్టులు చేయించుకోవాలని అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

దేశంలో కరోనా కేసులవ్యాప్తి పెరుగుతోంది. రోజురోజుకు కరోన కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. వారం క్రితం రోజుకు 10 వేల కంటే తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం లక్షకు చేరువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 2600పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news