వచ్చేది టీడీపీ ప్రభుత్వమే… వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తాం – అచ్చెన్నాయుడు

-

వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం జగన్ వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు యధా రాజా తధా ప్రజా అన్నట్టుగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్న లేస్తే ఎవరి ఆస్తులు విధ్వంసం చేద్దాం, ఎవరిపై అక్రమ కేసులు పెడదామా..? అని ‎ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ కార్యకర్తలు ఎవరిపై దాడి చేద్దాం, ఎవరి ప్రాణాలు తీద్దాం, ఎవరి ఆస్తులు లాక్కుందామా అని ఆలోచిస్తున్నారని.. రాష్ట్రంలో వైసీపీ గూండాల అరాచకాలకు, ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు.

నాగులు కుటుంబ సభ్యులపైనే కాక ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై కూడా దాడి చేశారంటే వైసీపీ గూండాలు పశువుల కన్నా హీనంగా తయారయ్యారని స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news