BREAKING : టీఆర్ఎస్ ఎంపీ నామా కుమారుడు పృథ్వీతేజపై దాడి

-

టీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ పై దాడి జరిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ కారును అడ్డగించి అందులోకి దుండగులు ఎక్కారు. అనంతరం.. కత్తితో బెదిరించి రూ. 75 వేలు దోపిడి చేశారు దుండగులు.

ఇక చేసేది ఏమీలేక… దుండగులపై పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టారు ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ. అయితే.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రెండు రోజుల కిందట జరిగినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా.. ఇవాళ ఆర్మూరు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రయత్నించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version