లంగర్ హౌజ్ లో దారుణం.. ప్రియురాలికి హాయ్‌ చెప్పాడని కత్తులతో దాడి !

-

హైదరాబాద్ లోని.. లంగర్ హౌజ్ బాపుఘాట్ వద్ద రెచ్చిపోయారు కొంత మంది విద్యార్ధులు. దుర్గా ప్రసాద్ అనే 10వ తరగతి విద్యార్ధి పై కత్తులతో దాడి చేశారు మరో ఇద్దరు విద్యార్థులు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో పార్టీ చేసుకున్న 10వ తరగతి విద్యార్ధులు… దుర్గా ప్రసాద్ కు మాయ మాటలు చెప్పి మోటర్ సైకిల్ పై రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని మూసి వద్దకు తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలోనే.. ఒక్క సారిగా దుర్గా ప్రసాద్ పై కత్తులతో దాడి చేశారు ఆ ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో దుర్గా ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దుర్గా ప్రసాద్ అరుపులు కేకలు వేయడంతో పారి పోయారు ఇద్దరు విద్యార్థులు. ఇక అక్కడే ఉన్న బాధితున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన గార్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే అక్కాసుతో దుర్గ ప్రసాద్ పై ఇద్దరు విద్యార్థులు కత్తి తో దాడి చేసినట్లు సమాచారం అందుతోంది.ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో పోస్టు చేశారు మిగతా విద్యార్థులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news