ఏపీ ప్రజలకు శుభవార్త..త్వరలోనే టిడ్కో ఇళ్ల పంపిణీ

-

అమరావతి : ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. టిడ్కో ఇళ్ళ పంపిణీపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండేలా ప్రణాళిక కొనసాగుతుందని వెల్లడించారు. మొదటి విడతలో 15 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణం చేపట్టామని… ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం ఇళ్ళ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

లే – అవుట్లలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వసతులు కల్పిస్తున్నామని ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు అందరినీ భాగస్వాములను చేస్తున్నామని… ఇళ్ళ నిర్మాణం కోసం కాల్ సెంటర్ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాల పురోగతి పై నిరంతరం సమీక్షలు చేపడుతున్నామని.. టిడ్కో ఇళ్ళు కూడా త్వరలోనే అందిస్తామని ప్రకటించారు. లబ్ది దారులకు ఎవరికీ కూడా.. నష్టం కాకుండా అందరికీ.. పంపిణీ చేస్తామని వెల్లడించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news