నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతి చెందింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మృతి చెందిన శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని ఆందోళన దిగారు. బిడ్డను మార్చేశారని, డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట భారీ ఎత్తున కుటుంబీకులు గుమిగూడి ధర్నాకు దిగారు.
![నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-24-at-10.31.55-AM.jpeg)
దీంతో స్థానిక పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే శిశువుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే శిశువు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తల్లిదండ్రులకు ముందే హెచ్చరించినట్లు తెలిపారు. దీంతో ఆస్పత్రి బయట కుటుంబీకులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.