కిరాతకులకు ముత్తాతలు…బీజేపీ నేతలంతా అవినీతి పరులే : బాల్క సుమన్

-

బీజేపీ పార్టీపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరాతకులకు ముత్తాతలు బీజేపీ నాయకులని…నేరస్థుల అడ్డా బీజేపీ అని నిప్పులు చెరిగారు. బీజేపీ లో చేరే నాయకులందరూ అవినీతి పరులేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లడుతూ.. అబద్దాలను ప్రచారం చేయడంలో గ్లోబల్ ను మించి పోయారని…ఓటర్లను భయ బ్రాంతులకు గురించేస్తుంది బీజేపీ అని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ తెచ్చినందుకు కెసిఆర్ ఖతం కావాలా ? అని ప్రశ్నించారు.

ఉద్యమ కారుడు గెల్లు శ్రీనును బానిస అని కిషన్ రెడ్డి అనడం వాళ్ళ అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం లో కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. ఆస్కార్ అవార్డు కెసిఆర్ కి కాదు.. కిషన్ రెడ్డి, మోడీ కి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బీజేపీ కి ఓటు వేస్తే అభివృద్ధిని అడుకున్నట్టేన్నారు. కరోనా తో దేహానికి నష్టం బీజేపీ తో దేశానికి నష్టమని… పాలన చేత కాకా కన్నీటి పర్యంతం అయిన వ్యక్తి మోడీ అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news