ఏ ముస్లిం కూడా హిందూ దేవాలయానికి రావొద్దు : బండి సంజయ్‌

-

వివాదస్పద వ్యాఖ్యలు, సంచలనాలకు మారు పేరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌. అయితే.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌ కుమార్‌.”నేనెప్పుడూ మసీదుకు పోలేదు, క్లియర్ గా రాను అనే చెప్తా నేను.. ఏ ముస్లిం కూడా నా హిందూ దేవాలయానికి రావాలని కోరుకొను నేను..” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హిందువుల ఓట్లు మాత్రమే చాలని.. వారితోనే.. అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఓ ప్రముఖ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంజయ్ అన్నారు.

ఇది ఇలా ఉండగా ఇవాళ భాగ్యలక్ష్మి టెంపుల్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఉత్తర ప్రదేశ్ లో నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం మాదిరిగానే.. పాత బస్తీ లోని భాగ్య లక్ష్మి దేవాలయాన్ని నిర్మిస్తామని బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశారు. భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయం నిర్మాణంతో పాత బస్తీ లోని టూత్ పాలిష్ ఐకాన్ లన్ని కొట్టుకుపోతాయని.. పాత బస్తీ లో ఐకాన్ భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయమేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎంపీ సీటు గెలుస్తామని.. ఆ తర్వాత పాత బస్తీ నుంచి ఎంఐఎం గుండాలను తరిమి కొడతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news