కేసీఆర్, కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్‌ తీసుకుంటారు : బండి సంజయ్‌

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు డగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక..అందరికి వీరందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ గద్దె దిగాక..తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బండి సంజయ్. లక్ష్మీనరసింహస్వామి పేరు ఉచ్ఛరించినందుకు కేసీఆర్, కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు బండి సంజయ్.

Afternoon brief: BJP Telangana chief Bandi Sanjay held, and all the latest  news | Latest News India - Hindustan Times

బీజేపీ తప్పు చేయలేదు కాబట్టే తాను..యాదగిరిగుట్టకు వెళ్లి తడబట్టలతో ప్రమాణం చేశానని బండి సంజయ్ తెలిపారు బండి సంజయ్. తాను ప్రమాణం చేయడం వల్లే బీజేపీ నిజాయితీ ప్రజలు తెలిసిందన్నారు బండి సంజయ్. కేసీఆర్ తప్పు చేయకుంటే యాదగిరిగుట్టకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎందుకు తన సవాల్ను స్వీకరించలేదన్నారు. కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టే..గుట్టకు రాలేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు గత మూడు నాలుగు రోజులుగా ప్రగతి భవన్లోనే ఉన్నారని…
తప్పుచేయకపోతే వారిని ప్రగతి భవన్లో దాచాల్సిన అవసరం ఏముందన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news