కేసీఆర్..వేములవాడ రాజన్న నీ అంతు చూస్తాడు : బండి సంజయ్

-

దేవుడికి ఇచ్చిన హామీలను నేరవేర్చ కపోతే.. ..వేములవాడ రాజన్న నీ అంతు చూస్తాడని కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ వేములవాడలో బండి సంజయ్‌ పర్యటించారు. ఈ సందర్భభంగా ఆయన మాట్లాడుతూ.. నాస్తికుల రాజ్యాంగ తెలంగాణ మారిపోయింది.. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్త అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని మండిపడ్డారు.

మేడారం జాతర కంటే ముందుగా రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీ కానీ భక్తుల సౌకర్యాల పై ప్రభుత్వం సమీక్ష చేయక పోవడం బాధాకరమని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ రాజన్న కి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు..క్యూలైన్ లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యంగులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. రాజన్న దేవుడికి సీఎం కేసీఆర్ శఠగోపం పెడుతావా…దేవుడికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే..నీ సంగతి దేవుడే తెలుస్తాడని హెచ్చరించారు. దేవాలయ అభివృద్ధి పై రంగు రంగుల బ్రోచర్లు చూపిస్తూ ఇంకెథకాలం భక్తులను మోసం చేస్తావ్ అంటూ కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news