కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణలో సాగనీయము… ఇదే మీకు చివరి బడ్జెట్: బండి సంజయ్

-

బీజేపీ పార్టీ ఉన్నంత వరకు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణలో సాగనీయం అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్, స్పీకర్ అపహాస్యం చేశారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని.. మళ్లీ అబద్దాలను బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టారని విమర్శించారు. ఇదే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అని అన్నారు. నీ నియంత, కుటుంబ పాలన కొనసాగనీయం అని ఆయన అన్నారు. మీ కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్ లో సమావేశాలు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగులు ఎక్కువ ఉన్నట్టే.. పోయే ప్రభుత్వానికి అబద్దాలు ఎక్కువ అంటూ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే రోజు గడిచిపోయిందని.. కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ శాసన సభ్యులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. నిలబడి ప్రశ్నించేందుకు సభ్యుల్ని సస్పెండ్ చేస్తారా..అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news