కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌లకు బండి సంజయ్‌ వార్నింగ్‌..

-

కేటీఆర్‌,సీఎం కేసీఆర్‌లకు బండి సంజయ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బండి సంజయ్..అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14 తేదీ నుండి జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నాం…సుమారు 311 కిలో మీటర్లు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంతో ముగిస్తామని ప్రకటన చేశారు.

కేటీఆర్‌, సీఎం కేసీఆర్ లు నోరు అదుపులో పెట్టుకోవాలని….లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. తప్ప కుండా ప్రజా సమస్యలపై, టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొను లేకుంటే గద్దె దిగు..ఏడేళ్ల నుండి లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు..పంటలు కోతకి వచ్చాయి.. నీకు పరిపాలన ఛాతకాదు..గద్దె దిగు అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్‌ను రైతులు ఎవరు నమ్మడం లేదు..రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కు నమ్మకం లేదంటూ ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news