కష్టాల్లో బంగ్లాదేశ్.. లంచ్ టైంకు 5 వికెట్లు లాస్!

-

చెన్నై వేదికగా జరుగుతున్న చెపాక్‌ టెస్టులో బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్‌ రహీం 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కేవలం 14 ఓవర్లకు బంగ్లా స్కోర్‌ -44/5 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో షకీబ్‌(8), లిట్టన్‌దాస్‌(0) ఉన్నారు.కెప్టెన్‌ శాంటో 20పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

బంగ్లాతో జరిగే టెస్టులో భారత పేసర్‌ ఆకాష్‌ దీప్‌ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్‌లో తొలి బంతికి జకీర్‌ హసన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆ​కాష్‌..రెండో బంతికి మోమినుల్ హక్ అదే తరహాలో ఔట్‌ చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం(2)ను బుమ్రా ​‍క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.339/9 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు అదనంగా కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో రోజు పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌ 3 వికెట్ల పడగొట్టి భారత్‌ జట్టను దెబ్బతిశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version