బీఆర్ఎస్ పై భట్టి సంచలన వ్యాఖ్యలు

-

నవంబర్ 30 తరువాత బీఆర్ఎస్ కి భవిష్యత్ లేదని.. మధిర అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను పారద్రోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇవాళ మధిర నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కి ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజలు కోరుకుంటున్న ఆరు హామీలను అమలు చేస్తామని తెలిపారు.

అలాంటి హామీలపై సంతకం చేసే ధైర్యం ఉందా..? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంబీలను ప్రభుత్వం ఏర్పాటు అయిన 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ కి భవిష్యత్ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 30 తరువాత బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసారు. పదేళ్ల రాష్ట్ర సంపదను దోచుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించు కోవాలనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సునామిలా ప్రభంజనం సృష్టించబోతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version