హోరాహోరీగా తలపడుతున్న దేవీశ్రీ, తమన్..!!

-

సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాల ఫైట్ మామూలు లేదు. ఇప్పటికే అభిమానులు దీనిపై సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య ,చిరంజీవి మధ్య థియేటర్ల కోసం టఫ్ ఫైట్ వుంది. వీరి సినిమాలతోనే మరో ఇద్దరి ఫైట్ కూడా జరుగుతోంది. వారేఎస్ ఎస్ థమన్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. వీరిద్దరూ సంగీత దర్శకుల గా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఒకప్పుడు దేవిశ్రీ వరుస సూపర్ హిట్స్ తో టాప్ లో ఉండేవాడు..కానీ ఈ మధ్య కాలంలో థమన్ వరుస హిట్స్ అందుకుని దేవీశ్రీ తో సంగీత పరంగా, సినిమాల పరంగా ఢీ అంటే ఢీ అనేలా తయారు అయ్యాడు.

ఇప్పుడు  ”వీరసింహ రెడ్డి” సినిమా తో  తమన్,వాల్తేరు వీరయ్య సినిమా తో దేవీశ్రీ బరిలో దిగారు. ఇప్పడు చిరు మరియు బాలయ్య కంటే వీరి ఫైట్ ఆసక్తికరంగా ఉంది.దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుంచి బాస్ పార్టీ అని సాంగ్ రిలీజ్ చెస్తే, తమన్ నుండి‘వీర సింహా రెడ్డి’కోసం‘జై బాలయ్య’ సాంగ్ ఇచ్చాడు . ఈ రెండు పాటల్లో మెగాస్టార్ ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ రాబడితే,  బాలయ్య బాబు ‘జై బాలయ్య’ సాంగ్ 7 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక ఇద్దరి పాటలపై నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రెండూ పాటలకే ఇంత హంగామా ఉంటె సినిమాలు విడుదల అయితే అది యుద్ధంలా మారే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news