బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరు

-

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో భాగంగా ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన తరువాత అన్నపూర్ణ స్టూడియో వద్ద అతని అభిమానులు నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేసి, బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతరులకు సంబంధించిన కార్లపైనా దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా.. శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో అటు పోలీసులు.. ఇటు ప్రశాంత్ తరఫు న్యాయవాదల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version