బీజేపీ ‘క‌మ‌లం’ గుర్తుకు ‘వ‌జ్రం’ గుర్తుతో డేంజ‌రే.!

-

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. తొలి రౌండ్ ముగిసే స‌మ‌యానికి బీజేపీ పార్టీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ముందంజ‌లో ఉన్నారు. ఈటెల రాజేందర్ 166 ఓట్ల లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ లో మొత్తం 9804 ఓట్లను లెక్కించ‌గా బీజేపీకి 4610 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ కు 4444 ఓట్లు పోలయ్యాయి. అయితే టీఆర్ఎస్ కారు గుర్తుని పోలిన రోటీమేక‌ర్‌, బీజేపీ క‌మ‌లం గుర్తును పోలి ఉన్న వ‌జ్రం గుర్తులు ఈ పార్ట‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చాయి.

etela

రోటీమేక‌ర్ గుర్తుకు 122 ఓట్లు, వ‌జ్రం గుర్తుకు 113 ఓట్లు పోల‌య్యాయి. విచిత్ర‌మేమిటంటే కాంగ్రెస్ అభ్యర్థికి
వ‌చ్చిన ఓట్లు కేవలం 119 ఓట్లు రోటీమేక‌ర్ గుర్తుకంటే త‌క్కువే. రెండో రౌండ్ ఫ‌లితాలు కూడా ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తుంది. బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version